ఖైదీ రీమేక్ ఫై బాలీవుడ్ హీరో కన్ను..?

ఇటీవల తెలుగులో సూపర్ హిట్స్ అయినా చిత్రాలను బాలీవుడ్ లో రీమేక్ చేసి హిట్స్ కొడుతున్నారు . రీసెంట్ గా అర్జున్ రెడ్డి చిత్రాన్ని కబీర్ సింగ్ గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ నేపథ్యంలో మరికొన్ని సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 ని రీమేక్ చేసే ఆలోచనలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఉన్నట్లు తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తరువాత, తమిళంలో సూపర్ హిట్టైన కత్తి సినిమాను తెలుగులో ఖైదీ నెంబర్ 150 పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్టైంది. దాదాపు రూ. 200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. వినాయక్ డైరెక్ట్ చేయగా.రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్ రీమేక్ చేయబోతున్నారు. మిషన్ మంగళ్ సినిమాకు దర్శకత్వం వహించిన జగన్ శక్తి ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి రానుందని అంటున్నారు. ప్రస్తుతం అక్షయ్ నటించిన మిషన్ మంగళ్ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.