గత ఏడాది ‘మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసిన కీర్తి సురేష్ ఈమద్య జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మహానటి చిత్రంకు గాను జాతీయ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ను పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఈ సమయంలోనే ఈమె ‘మిస్ ఇండియా’ అనే చిత్రంలో నటించింది. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ను తాజాగా రివీల్ చేశారు. ఈ సమయంలోనే టైటిల్ లోగోను కూడా రివీల్ చేయడం జరిగింది.
మొన్నటి వరకు ఈ చిత్రం గురించి పెద్దగా బయటకు తెలియకుండా లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేశారు. అయితే సినిమా విడుదల సమయంకు సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు. నరేంద్ర నాధ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నాడు. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను ఎప్పుడు విడుదల చేసే విషయమై క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాని కీర్తి సురేష్ లుక్ మరియు టీజర్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు పెరిగి పోయాయి. మహానటి చిత్రం తర్వాత మరోసారి కీర్తి సురేష్కు మిస్ ఇండియా మరో విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయంగా కనిపించింది. మరి మిస్ ఇండియాతో కీర్తి సురేష్ ఎలాంటి ఫలితాన్ని చవి చూస్తుందో చూడాలి.