ఆ ఫోటోలను చూపించకండి ప్లీజ్…

katగత కొన్ని రోజులుగా బాలీవుడ్ లో ‘టాక్ అఫ్ ది టౌన్’గా మారారు హీరో రణ్ బీర్ కపూర్, కత్రినా కైఫ్. స్పెయిన్ హాలిడ్ టూర్ లో వీరిరువురి రోమాన్స్ ఓ మీడియా కన్నుకు చిక్కింది. రణబీర్‌తో అత్యంత రహస్యంగా కత్రినా సాగించిన వెకేషన్ ఫోటోలు బయటకు వచ్చి హడావిడి చేశాయి. ఆన్ స్క్రీన్ కంటే అఫ్ స్క్రీన్ లోనే వీరి కెమిస్ట్రీ బాగుందని మీడియా కోడైకూస్తోంది. ఫొటోస్ లో మసాలా కూడా అంతే ఘాటు గా వుంది మరి. అయితే తన పర్సనల్ విషయాలు ఇలా బట్టబయలు అవడం పై కత్రినా ఆవేదన వ్యక్తం చేసింది. తన పర్సనల్ విషయాలు అనుమతి లేకుండా బయట పెట్టే హక్కు మీకెక్కడిది అంటూ మీడియాపై మండి పడింది. ఈ మేరకు మీడియా వారికి బహిరంగ లేఖ రాసింది.

తను, రణ్ బీర్ కలిసి ఉన్న ఫోటోలు ఓ ఫిల్మ్ మ్యాగజైన్ (స్టార్ డస్ట్) లో రావడంపై తాను తీవ్రంగా బాధపడుతున్నానని తెలిపింది. తాను, వేరొకరితో ఉన్నప్పుడు ఎవరో తమ అనుమతి లేకుండా తీసినవాటిని కమర్షియల్ గా ఉపయోగించుకునేందుకే ఇలా చేశారని విమర్శించింది. ఇలా చేయడం ఓ రకమైన జర్నలిజమ్ కు సాక్ష్యంగా ఉన్నాయని, హద్దులు దాటి ఇతరుల స్వంత విషయాల్లోకి దూరి, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించారనడానికి నిదర్శనమిదేనని మండిపడింది. దయచేసి ఆ ఫోటోలను పదేపదే చూపకుండా ఆపాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. ఆ ఫోటోల వెనక ఎలాంటి కారణం లేదని చెప్పుకొచ్చింది కత్రినా.