Site icon TeluguMirchi.com

‘కాష్మోరా’ బడ్జెట్ చూసి షాక్ అవుతున్న సినీ జనాలు..

Karthi-Kashmoraఆవారా , ఊపిరి చిత్రాలతో తెలుగు లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తీ , తాజాగా కాష్మోరా అనే ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం తో రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..గోకుల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పివిపి సంస్థ అధినేత వరప్రసాద్ నిర్మించడం జరిగింది..

ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందడం జరిగింది..తెలుగు ,తమిళ భాషలలో దాదాపు 2000 లకు ఫైగా థియేటర్స్ లలో రిలీజ్ కాబోతుంది..ఇక ఈ చిత్రానికి పెట్టిన బడ్జెట్ విని అందరూ షాక్ అవుతున్నారు..పివిపి అంటేనే భారీ చిత్రాలను తెరకెక్కించే నిర్మాత అని ఇండస్ట్రీ లో పేరుంది..ఆ పేరుకు తగట్టే ఈ సినిమాకు 50 కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగిందట..అంత మొత్తం వసూళ్లు చేస్తుందా..కార్తీ ని నమ్మి అంత పెట్టొచ్చా అంటే అది అతడికే తెలియాలి.

కార్తీ మూడు డిఫరెంట్ రోల్స్‌లో ఈ చిత్రం లో కనిపించనున్నాడు. కార్తీ సరసన నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటించడం జరిగింది..మరి కాష్మోరా లో ఏముంది అనేది తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version