బాహుబలి రెండు భాగాలను హిందీ లో రిలీజ్ చేసి భారీ లాభాన్ని వెనకేసుకున్నాడు డైరెక్టర్ కామ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్..ఇప్పుడు ఈయన ఫోకస్ అంత తెలుగు సినిమాల పైనే పెడుతున్నాడట..ప్రస్తుతం మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న స్పైడర్ మూవీ ఫైనే పెట్టాడట. తాజాగా రిలీజైన ‘స్పైడర్ టీజర్ చూసి.. థ్రిల్లయిపోయిన కరణ్ జోహార్.. ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని.. ఇలాంటి విశేషాలు మరిన్ని చూడాలని ఉత్సాహంగా ఉందని అంటూ మహేష్ బాబు, మురుగదాస్లకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు.
తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ‘స్పైడర్ను హిందీలోనూ అనువాదం చేయనున్నారు. ‘గజిని’, ‘హాలిడే’ లాంటి సినిమాలతో మురుగదాస్ హిందీ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పడు ‘స్పైడర్’ బాలీవుడ్ ప్రేక్షకుల టేస్టుకు తగ్గ ఇంటలిజెంట్ థ్రిల్లర్ మూవీలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ ఆ సినిమాను తన బేనర్ మీద హిందీలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడట..అందుకే ఇప్పటి నుండే బేరాలు సాగిస్తున్నాడని సమాచారం.