అందరి మనసులూ గెలుచుకొంటోంది… అక్కినేని ‘మనం’. ఈ శుక్రవారం విడుదలైన మనం క్లాస్, మాస్ అనే తేడా లేకుండా… అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు సాధిస్తోంది. సినీ సెలబ్రెటీలు కూడా మనం సినిమాకి ఓ అపురూప దృశ్యకావ్యం అంటూ పొగిడేస్తున్నారు. టాలీవుడ్ అంతా.. ఈ సినిమాకి కీర్తించింది. ఇప్పుడు కమల్హాసన్ కూడా మనం… ది గ్రేట్ అంటున్నాడు. ”నేను శివాజీ, ఏఎన్నార్ అభిమానిని. మనం సినిమా చూసి మళ్లీ అక్కినేని అభిమానిగా మారిపోయా. ఈ సినిమాలో అందరూ నవ్వుతున్న సన్నివేశాల్లో.. నాకు అక్కినేనితో ఉన్న అనుబంధం గుర్తొచ్చి.. ఏడుపొచ్చేది. ఇలాంటి ఓ అపురూప చిత్రం తీయాలన్న ఆలోచన నిజంగా గొప్పది. అక్కినేనికి మరణం లేదు. నాగార్జునలో, నాగచైతన్యలో నాలాంటి అభిమానుల గుండెల్లో ఆయన బతికే ఉంటారు..” అని ప్రసంశల జల్లు కురిపించారు.