కమల్ హాసన్ కొత్తగా చెప్పాల్సిన వ్యక్తి కాదు ఈయన..బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకొని , విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఈయన ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడా..అంటే అవుననే సమాధానం చెప్పాడు కమల్.
ప్రస్తుతం కమల్ రాజకీయాల ఫై పూర్తి శ్రద్ద పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమం లో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే తాను సొంతంగా ‘మక్కల్ నీది మయమ్’ అనే పార్టీ స్థాపించిన సంగతి తెల్సిందే. అందుకే ఇక ఆ పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడట.
ప్రస్తుతం తన తాజా చిత్రాలు విశ్వరూపం 2, శభాష్ నాయుడు, భారతీయుడు సీక్వెల్కి సంబంధించిన పనులు చూసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కమల్ హాసన్ తన ట్విట్టర్లో అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో ఓ అభిమాని ఒకరు మీరు సత్యజిత్ రేఎం, శ్యామ్ బెంగాల్ వంటి దర్శకులతో పనిచేయకపోవడం పై బాధపడుతున్నారా అని అడగ్గా కమల్ సమాధానం ఇస్తూ వాళ్ళు నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళు నాకు ఎప్పుడూ సినిమా ఆఫర్ ఇవ్వలేదు. పైగా సత్యజిత్ రే ఇప్పుడు లేరు. నేను కూడా ఇకపై సినిమాలు చేయబోవడం లేదు అంటూ తాను త్వరలో సినిమాలనుండి రిటైర్ కానున్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. దీంతో ఇక కమల్ నుండి వచ్చే సినిమాలు ఆ మూడే..అని అభిమానులు , ప్రేక్షకులు ఫిక్స్ అవుతున్నారు.