విశ్వ నటుడిగా స్థానం సంపాదించుకున్న కమల్ హాసన్..త్వరలో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడని వినికిడి. ప్రస్తుతం ‘శభాష్ నాయుడు’ చిత్రంతో బిజీగా ఉన్నప్పటికీ చిక్కుల్లో ఉన్న ‘విశ్వరూపం-2’ విడుదల చేసేందుకు కమల్హాసన్ ప్లాన్ చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం షూటింగ్ లో కాలికి దెబ్బతగిలి ఆస్పత్రిలో చికిత్స పొందడం జరిగింది.
అప్పుడు కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడే తొలిసారిగా ఓ వాణిజ్య ప్రకటనలో నటించడం జరిగింది. ఈ నేపథ్యంలో తమిళ ‘బిగ్ బాస్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాలంటూ ప్రముఖ టీవీ ఛానల్ ఆయన్ను సంప్రదించిందని తెలుస్తుంది. దీనిపై అధికారిక సమచారం త్వరలో వెలువడనుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.