Site icon TeluguMirchi.com

క‌ల్యాణ్‌రామ్ కోపం ఎవ‌రిమీద‌??

kalyan-ram-s-om-audio-on-may-25thక‌ల్యాణ్‌రామ్ త్రీడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే.. ఓం. సునీల్ రెడ్డి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. నికీషాప‌టేల్‌, కృతిక‌ర్బందా క‌థానాయిక‌లు. ఈ చిత్రంలోని పాట‌ల్ని ఈనెల 25న విడుద‌ల చేయ‌బోతున్నారు. ప‌గ‌, ప్రతీకారాల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. క‌ల్యాణ్ రామ్ కోపం ఎవ‌రిమీద‌? త‌ను ఎవ‌రిపై త‌న ప్రతీకారం తీర్చుకొన్నాడు? అనే విష‌యాల‌ను తెర‌పైనే చూడాలి. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి తీర్చిదిద్దిన చిత్రమిది. హ‌లీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం ప‌నిచేశారు. పోరాట దృశ్యాల‌ను త్రీడీలోచూడ‌డం ఓ కొత్త అనుభూతి.. అని క‌ల్యాణ్‌రామ్ చెబుతున్నారు. అచ్చు, సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version