Site icon TeluguMirchi.com

మ‌ళ్లీ మ‌గ‌ధీర జోడీ?

charan5మ‌గ‌ధీర‌లో మిత్రవింద‌గా సంద‌డి చేసింది కాజ‌ల్‌. మ‌గ‌ధీర సాధించిన ఘ‌న విజ‌యంలో రామ్‌చ‌ర‌ణ్ – కాజ‌ల్‌ల జోడీ కూడా ఎక్కువ మార్కులు సంపాదించుకొంది. ఇప్పుడు మ‌రోసారి వీరిద్దరూ వెండి తెర‌పై సంద‌డి చేయ‌బోతున్నట్టు స‌మాచార‌మ్‌. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రూపుదిద్దుకోనుంది. రామ్‌చ‌ర‌ణ్‌, వెంక‌టేష్ లు క‌థానాయ‌కులుగా న‌టించ‌నున్నారు. కృష్ణ ఓ కీల‌క పాత్రలో కనిపిస్తారు. బండ్ల గ‌ణేష్ నిర్మాత‌. ఈసినిమా కోసం చ‌ర‌ణ్ ప‌క్కన కాజ‌ల్ క‌న్‌ఫామ్ అయిన‌ట్టు స‌మాచార‌మ్‌. వెంకీ స‌ర‌స‌న (ఒక వేళ ఆయ‌న ఈ సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకొంటే..) న‌య‌న‌తార‌ను ఎంపిక చేసే అవ‌కాశాలున్నాయి. ద‌స‌రా రోజులు ఈ సినిమా లాంఛ‌నంగా సెట్స్‌పైకి వెళ్లనుంది.

Exit mobile version