Site icon TeluguMirchi.com

ముచ్చటగా మూడో సారి !

charanకృష్ణవంశీ మల్టీస్టారర్‌ కు  ముహూర్తం అచ్చిరానట్టుంది. వెంకటేష్‌, రామ్‌చరణ్‌లతో అనుకున్న ఈ ప్రాజెక్టులో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. మొన్నటి వరకు వెంకటేష్‌ ఈ ప్రాజెక్ట్ లో చేస్తాడనుకున్నారు. కొన్ని కారణాల వల్ల వెంకీ  స్థానాన్ని శ్రీకాంత్‌ రిప్లేస్‌ చేశాడు. ఆ తరువాత హీరోయిన్‌గా తమన్నాను సెలెక్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి కాజల్‌ చేరింది. తమన్నాకు డేట్స్‌ అడ్జెస్ట్‌ కాకపోవండతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘అగడు’, ‘బాహుబలి’ వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉంది. అందుకే  ఆ స్థానంలో కాజల్‌ని తీసుకున్నారు. గతంలో రామ్ చరణ్ – కాజల్ కలిసి మగధీర, నాయక్ సినిమాలతో విజయాన్ని అందుకొని హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇక కాజల్ ను సెలెక్ట్ చేయడం పై  దర్శక, నిర్మాతలుకూడా మొగ్గు చూపినట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు.

Exit mobile version