బృందావనం, బాద్షాలలో ఎన్టీఆర్ – కాజల్ల జోడీ ఆకట్టుకొంది. వీరిద్దరూ త్వరలోనే హ్యాట్రిక్ కొట్టబోతున్నారా?? అవుననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ఎన్టీఆర్-సుకుమార్ల కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రంలో కథానాయికగా కాజల్ పేరు పరిశీలిస్తున్నారు. కాజల్కి గతేడాది ఏమాత్రం కలసిరాలేదు. పెద్ద పెద్ద అవకాశాల్ని వదులుకొంది. ఈ యేడాది మాత్రం మంచి సినిమాలే చేస్తోంది. అటు చరణ్తో కృష్ణవంశీ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. చూస్తుంటే కాజల్ హవా మొదలైనట్టే కనిపిస్తోంది. ఏప్రిల్లో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్లనుంది.