నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అందులో ఒకటి ‘ఎమ్మెల్యే’, మరొకటి ‘నా.. నువ్వే’.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ను విడుదల చేశారు. వచ్చేస్తున్నాడు.. వచ్చేశాడు.. మనందరి ఆశాజ్యోతి… ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ..’ అన్న డైలాగ్ సినిమాపై ఆసక్తి రేకెత్తించింది. మార్చి 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ సందర్భంగా ఓ స్టిల్ ను వదిలారు. ఇందులో కళ్యాణ్ రామ్ కాజల్ కి మడ్డుగా తినిపిస్తూ కనిపించారు.
ఇందులో కల్యాణ్రామ్కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. ‘లక్ష్మీ కల్యాణం’ తరువాత కల్యాణ్రామ్, కాజల్ జంటగా నటిస్తున్న రెండో చిత్రం ఇది. ఉపేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.