సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించేస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వాటి చిత్రీకరణ ఎలా చేస్తారు.. ఆర్టిస్టులు ఆ సన్నివేశాలు చేయడానికి సిగ్గుపడరా? అనే అనుమానాలు సాధారణంగా ప్రేక్షకులకు వస్తుంటాయి. అందునా ఆ సన్నివేశం లిప్ లాక్ అయితే? అది కూడా ఇద్దరు కొత్త ఆర్టిస్టులు చేస్తే? వారిద్దరు బాగా పేరు సంపాదించుకున్న ఆర్టిస్టుల వారసులయితే? ఇన్ని ప్రశ్నలకు కేంద్రబిందువయింది మణిరత్నం “కడలి” సినిమాలోని లిప్ లాక్ సీన్. ఈ చిత్రంలో అలనాటి హీరో కార్తీక్ కుమారుడు గౌతం హీరోగా, అందాల నటి రాధ కుమార్తె తులసి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇద్దరూ తెరకు కొత్తే. వీరిపై ఓ లిప్ లాక్ సన్నివేశం కథ డిమాండ్ మేరకు దర్శకుడు మణిరత్నం చిత్రీకరించాల్సి వచ్చింది. అదికూడా తన స్టైల్లో బాగా నాచురల్ గా రావాలి మరి. లొకేషన్ లో బాగా జనాలు ఉండడంతో గౌతం, తులసి బాగా బెరుకుగా ఫీలయి టేకుల మీద టేకులు తీసుకున్నారట. దీంతో పరిస్థితి గమనించిన మణిరత్నం సెట్స్ నుండి అందరినీ బయటకు పంపేసి అవసరమయిన వారిని మాత్రమే ఉంచి ఫైనల్ గా తనకు కావలసిన సన్నివేశం చిత్రీకరించారట. ఈ హడావుడికి దాదాపు 4గంటల సమయం పట్టినట్టు సమాచారం. అంతాచేస్తే సదరు లిప్ లాక్ సన్నివేశం తెరపై కనిపించేది మాత్రం కేవలం పది సెకన్ లేనట. మరి ఈ అద్భుతం తెరపై చూడాలంటే మాత్రం ఫిబ్రవరి 1 వరకు ఆగక తప్పదు.