Jr NTR : అరుదైన గౌరవాన్ని అందుకున్న ఎన్టీఆర్..


గ్లోబల్ సెన్సేషన్ RRR మూవీ ఆస్కార్‌కి చేరి అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్‌ లో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే తాజాగా ఎన్టీఆర్ మరో అరుదైన గౌరవాన్ని పొందారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్ లో సభ్యత్వాన్ని పొందారు. ఈ విషయాన్ని అకాడమీ కమిటీ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఇదో ప్రౌడ్‌ మూమెంట్‌ అంటూ తారక్ ను అభినందిస్తున్నారు. అంతేకాదు ఆస్కార్‌ కమిటీ సభ్యుడిగా నియమితులైన తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్‌ ఖ్యాతి దక్కించుకున్నారు.

ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్స్ యొక్క కొత్త మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్‌లో ఎన్టీఆర్ తో పాటు మరో నలుగురు హాలీవుడ్ నటులు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్ మరియు రోసా సలాజర్‌ లు స్థానం సంపాదించుకున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.