పౌరాణిక పాత్రలు చేయాలంటే నందమూరి హీరోల తరవాతే ఎవరైనా. ఎన్టీఆర్ ఈ పాత్రలకు పెట్టింది పేరు. ఆ వారసత్వాన్ని బాలకృష్ణ అక్షరాలా పుణికి పుచ్చుకొన్నారు. మనవడు ఎన్టీఆర్ కూడా ఏమాత్రం తగ్గడు. యమదొంగలో యంగ్ యమగా అదరగొట్టాడు. ఇప్పుడు దుర్యోధనుడిగా కనువిందు చేయబోతున్నాడు. అవును.. ఎన్టీఆర్ దుర్యోధనుడి అవతారం ఎత్తనున్నాడు. రామయ్యా వస్తావయ్యా సినిమా కోసం. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. దిల్ రాజు నిర్మాత. ఈ సినియాలోని ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ గద పట్టుకొని దుర్యోధనుడి డైలాలుగు పలుకుతాడట. ఆ సన్నివేశం అభిమానులకు తెగ నచ్చేస్తుందని చిత్రబృందం ధీమాగా ఉంది. అయితే.. ఈ విషయం బయటకు పొక్కనివ్వడం లేదు.