రామ్చరణ్ లేటెస్ట్ చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకుడు. సమంత హీరోయిన్. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ వుంది. ఇందులో పూజాహెగ్డే ఆడిపాడుతుంది. ‘జిల్ జిల్ జిగేల్’ అని సాగే ఈ పాట చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్లో జరిగింది. ఈ పాటకు జానీ మాస్టర్ కోరియోగ్రఫీ సమకూర్చారు. ఈ సందర్భంగా జానీ ట్వీట్ చేశారు. చరణ్తో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
‘ఎప్పటిలాగే మెగా పవర్స్టార్ పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆయన అంకితభావం చూసి ఆశ్చర్యపోయా. ‘రంగస్థలం’ సినిమా కోసం పనిచేసే అవకాశం ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్కు, ప్రత్యేకించి రామ్చరణ్, సుకుమార్, దర్శకత్వ బృందానికి కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు జానీ .
మైత్రీ మూవీ మేకర్స్ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తోంది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.