దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, ఇప్పటికే చాలా వరకు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు తమవంతు సాయంగా ప్రభుత్వానికి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే తమిళ సినీ తారలు సూపర్ స్టార్ రజనీకాంత్, తల అజిత్, తలపతి విజయ్, ప్రముఖ దర్శకుడు మురుగదాస్, తమిళ స్టార్ హీరో సూర్య ఫామిలీ, రజనీకాంత్ కుమార్తె తమవంతు సాయంగా కరోనా రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అందించారు.
తాజాగా మరో తమిళ స్టార్ హీరో జయం రవి ఫ్యామిలీ సీఎం కరోనా రిలీఫ్ ఫండ్ కి విరాళాలు అందజేశారు. ఈరోజు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్, ఆయన కుమారులు దర్శకుడు జయం మోహనరాజు, హీరో జయం రవి తమిళనాడు ముఖ్యమంత్రిని కలిసి రూ.10 లక్షల విరాళం విరాళం అందజేశారు.