ఆర్ఆర్ఆర్ ఆఫర్నే వద్దన్నదట…

రాజమౌళి దర్శకత్వంలో ఓ చిన్న పాత్ర చేసిన చాలని చాలామంది కోరుకుంటారు. అలాంటిది ఏకంగా హీరోయిన్ ఆఫర్ వస్తే కాదన్నదట. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా..అయితే ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే ..రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొమరం భీం , అల్లూరి సీతారామరాజు పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు.

కాగా చరణ్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియాను ఎన్నిక చేయగా..ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ భామ డైసీ ని సెలక్ట్ చేసారు రాజమౌళి. అయితే డైసీ ఈ సినిమాను నుండి తప్పుకోవడం తో ఆ ప్లేస్ లో మరో విదేశీ భామ కోసం గట్టిగానే ట్రై చేసారు. కానీ ఎవరు కూడా దొరక్కపోవడం తో కథను చేంజ్ చేసి.. ఆ పాత్రను భారతీయ యువతీ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. ఆ పాత్రలో రాజమౌళి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ని అనుకున్నాడట. ఈ మేరకు ఆమెను కలువగా.. టాలీవుడ్ మొదటి సినిమా కాబట్టి తనకు వెయిట్ ఉండాలని కోరుకుంటున్నానని కానీ ఇందులో అంత స్కోప్ కనిపించడం లేదని నో చెప్పిందట. రాజమౌళి ఆఫర్ కాదనడం పట్ల అభిమానులు మండిపడుతున్నారు. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది.