అలాగే ఫ్యాన్స్ ని భారీ ఎత్తున ఆహ్వానించి వారి సమక్షంలో ఆడియో వేడుక చేయడానికి చిత్ర యూనిట్చే సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక ఈ నెల 12న హైదరాబాద్ లో ని శిల్ప కళా వేదిక లో జరగనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు . సెప్టెంబర్ 2న జనతా గ్యారేజ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ థియేటర్స్ లలో రిలీజ్ కానుంది . ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో సంచలనం సృష్టిస్తున్న జనతా గ్యారేజ్ రేపు రిలీజ్ అయ్యాక ఇంకా ఏలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి .