Site icon TeluguMirchi.com

‘జనతా గ్యారేజ్’ ఆడియోకి గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…

Chiru-Guest-Janathaఎన్టీఆర్ , సమంత , నిత్యమీనన్ జంటగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’..ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 22 న హైద్రాబాద్ లోని శిల్ప కళ వేదిక లో అభిమానుల మధ్య జరగనుంది..అయితే ఈ ఆడియో కి ఎవరు గెస్ట్ గా వస్తారనే సందేహం అందరిలో కలుగుతుంది..కాగా అందరూ షాక్ తినేలా ఈ ఆడియో కి ఓ గెస్ట్ రాబోతున్నాడని సమాచారం ఫిల్మ్ సర్కిల్ లో వినపడుతుంది..

ఇంతకీ ఎవరా ఆ గెస్ట్ అనుకున్నారా..మెగా స్టార్ చిరంజీవి ఈ ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా రాబోతున్నాడు..ఇటీవల జరిగిన మా అవార్డ్స్ వేడుకలో చిరు చేతుల మీదుగా ఎన్టీఆర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే..అంతే కాదు సినిమాకు సంబంధించిన విశేషాలను చిరు , ఎన్టీఆర్ ను అడిగి తెలుసుకున్నాడట. ఈ నేపథ్యం లోనే చిరు ఆడియో కు గెస్ట్ గా వస్తాడనే వార్తలు బాగా ప్రచారం అవుతున్నాయి..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం చిత్ర యూనిట్ నుండి రావాల్సి ఉంది..

Exit mobile version