జై లవకుశ యూఎస్ టాక్ ..

టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన చిత్రం ‘జై లవకుశ’. ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ తొలిసారిగా మూడు(జై, లవ, కుశ) భిన్నమైన పాత్రలలో నటించడం తో భారీ అంచనాల మధ్య ఈ మూవీ అభిమానుల ముందుకు వచ్చింది..

ఇక యూఎస్ టాక్ మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. మొదటి సారి ఎన్టీఆర్ కు కరెక్ట్ కథ దొరికిందని..మూడు పాత్రల్లో ఎన్టీఆర్ అదరగొట్టాడని అంటున్నారు. ముఖ్యం గా జై రోల్ లో మారే ఏ స్టార్ చేయలేడని ఒక్క మాటలో చెపుతున్నారు. ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు..కేవలం యాక్షన్ మాత్రమే కాదు కామెడీ , ప్రేమికుడు ఇలా మూడు కోణాల్లో అద్భుతంగా నటించాడని అభిమానులు చెపుతున్నారు.

రాశిఖన్నా , నివేద థామస్ ఇద్దరు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారని , నివేద సెకండ్ హాఫ్ లో జై కి లవర్ గా అద్భుతంగా కనిపించిందని చెపుతున్నారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న ఈమె , ఈ మూవీ లో కాస్త హాట్ గా కనిపించింది. దేవి శ్రీ మ్యూజిక్ , చోట కె సినిమా ఫొటోగ్రఫీ అద్భుతం అని చెపుతున్నారు.. బాబీ లో ఇంత దమ్ము ఉందా అని సినిమా చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇంతవరకు ఎవరు రాయని కథ ను రాయడమే కాదు తెరకెక్కించడం లో కూడా సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.