Site icon TeluguMirchi.com

‘ జై లవకుశ ‘ నైజాం రైట్స్ ఎంతో తెలుసా..?

టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ వంటి వరుస హిట్ చిత్రాలతో అలరించిన యాంగ్ టైగర్ ఎన్టీఆర్ , తాజాగా మరో బ్లాక్ బస్టర్ అందుకునేందుకు జై లవకుశ తో వస్తున్నాడు. బాబీ దర్శకత్వం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం ఫై తెరకెక్కిన ఈ మూవీ దసరా కానుకగా ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ట్రైలర్ , ఆడియో , స్టిల్స్ తో భారీగా అంచనాలు పెరగడం తో చిత్ర బిజినెస్ కూడా భారీ గా జరిగినట్లు తెలుస్తుంది. తాజాగా నైజాం రైట్స్ ను సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డిస్ట్బ్యూటర్ అయినా దిల్ రాజు రూ. 18 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.


ఒక్క నైజాం మాత్రమే కాదు , ఓవర్సీస్ , కృష్ణా, ఉభయ గోదావరి , గుంటూరు , సీడెడ్ ఇలా అన్ని ఏరియాలు రైట్స్ కూడా భారీ రేటుకే అమ్ముడైనట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపించడం తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు యూవత్ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. నివేద , రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటించగా , దేవి శ్రీ సంగీతం అందించాడు.

Exit mobile version