Site icon TeluguMirchi.com

జై లవకుశ క్లైమాక్స్ లీక్…?

ఎన్టీఆర్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ మూవీ అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. ఇప్పటివరకు రిలీజ్ అయినా వీడియోస్ తో చిత్ర కథ ఫై జనాలకు కాస్త అవగాహన వచ్చేసింది. దానికి తోడు సెన్సార్ టాక్ తో సినిమా కథ ఫై పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ లోపు సినిమా కథ ఇదే..క్లైమాక్స్ ఇలాగే ఉంబోతుందంటూ ఓ వార్త ఫిలిం నగర్ లో తెగ ప్రచారం అవుతుంది.

బయటకు వచ్చిన కథ ప్రకారం..చిన్నతనంలోనే నాటకాల కంపెనీని జై తగులబెట్టేసి వెళ్లడం, ముగ్గురు ఎవరికి వారు మిగిలిన వారు చనిపోయారని అనుకోవడం, కానీ అంతలోనే లవుడు, కుశుడు కలవడం, హ్యాపీగా వున్న టైమ్ లో జై సీన్ లోకి వస్తాడట.. జై రావడంతోనే కథ లో అసలైన ట్వీస్ట్ లు వస్తుంటాయట.

క్లైమాక్స్ ని ముందుగా లవ, కుశ ఇద్దరు జై పాత్రని అంతం చేయడంతో ముగించాలని అనుకున్నారంట దర్శకుడు. అయితే జై పాత్రలో ఉన్న ఇంటెన్సన్, అభిమానులకి చేరువయ్యే విధానం చూసి ఇప్పుడు ఈ క్లైమాక్స్ ని అదిరిపోయే రేంజ్ లో రివీల్ చేస్తున్నట్లు సమాచారం. జై లవకుశ సినిమాకి క్లైమాక్స్ పెద్ద ట్విస్ట్ అవుతుందని, ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాలో క్లైమాక్స్ ఉంటుందని ఫిలిం సర్కిల్లో ఈ కథ వినిపిస్తుంది. మరి ఈ కథ ఎంత వరకు నిజం అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు.

Exit mobile version