ఎన్టీఆర్ హీరోగా రాశి ఖాన్ , నివేద థామస్ జంటగా బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం జై లవకుశ. ఇప్పటికే మూవీ లోని జై ఫస్ట్ లుక్ టీజర్ తో అందరిలో అంచనాలు పెంచేసిన చిత్ర యూనిట్.. ఇక ఈ చిత్రంలోని రెండో పాత్ర లవ కుమార్ని రాఖీ పౌర్ణమికి పరిచయం చేయబోతోంది. సోమవారం ఉదయం 10.35 గంటలకు లవకుమార్ ఫస్ట్లుక్ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సోషల్మీడియా ద్వారా తెలిపారు.
ప్రస్తుతం ఈ చిత్ర ఘాన్గ్ పూణే లో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరికల్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.