మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కరెంట్ తీగ. హై ఓల్టేజ్ అనేది ఉపశీర్షిక. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. జి.శ్రీనివాసరెడ్డి దర్శకుడు. ఈ చిత్రంలో సన్నీలియోన్ కూడా నటిస్తోంది. మరో విశేషం ఏమిటంటే… జగపతి బాబు ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ధృవీకరించింది కూడా. లెజెండ్ తరవాత జగపతికి ప్రతినాయకుడి అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికి ఆయన చేతిలో దాదాపు ఆరు సినిమాలున్నాయి. పిల్లా నువ్వు లేని జీవితం, రా రా కృష్ణయ్య చిత్రాల్లో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పుడు కరెంట్ తీగ కూడా చేరింది. ఇప్పటికి 40 శాతం చిత్రీకరణ పూర్తయింది.జులైలో పాటల్ని విడుదల చేయనున్నారు.