ప్రభాస్ కు విలన్ అయ్యాడు..

ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న జగపతి బాబు..సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా , క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా హల్చల్ చేస్తున్నాడు. తెలుగు , తమిళ్ , కన్నడ భాషల్లోనే కాక వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీ గా మారాడు. తాజాగా ఇక ఇప్పుడు ప్రభాస్ కు విలన్ అయ్యాడని తెలుస్తుంది.

ప్రభాస్- రాధాకృష్ణ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం లో జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాదులో జరుగుతోంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా జగపతి బాబు పాత్రను చాలా డిఫరెంట్ గా మలిచినట్టు సమాచారం. ఇంతవరకూ చేయని పాత్రలో జగపతిబాబు కనిపించే తీరు ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఆయన లుక్ .. డైలాగ్ డెలివరీ కూడా విలక్షణంగా వుంటాయని చిత్ర యూనిట్ చెపుతున్నారు. యూవీ క్రియేషన్స్ .. కృష్ణంరాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం, ‘ఓ డియర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. మరి ఇదే ఫైనల్ అవుతుందా లేదా అనేది చూడాలి.