Site icon TeluguMirchi.com

విప్లవం లో అడుగుపెట్టిన జగన్…

Narayanamurthi-Puriఇప్పటి వరకు పూరి జగన్నాథ్ అంటే ప్రేమ కథలను, సందేశాత్మక కథలను తీయడం లో దిట్ట అని పేరు ఉంది. ఇప్పుడు పూరి మరో అడుగు ముందుకు వేసి విప్లవ రంగం లోకి దిగుతున్నాడు..పూరి విప్లవ రంగం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఈస్టొరీ చూస్తే మీకే అర్ధమవుతుంది..

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ పూర్తి స్థాయి విప్లవ చిత్రాన్ని తీయాలని డిసైడ్ అయ్యాడని ఫిలిం నగర్ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటివరకూ తెలుగులో విప్లవాలకు సంబధించిన చిత్రాలు తీయాలంటే ఇండస్ట్రీ లో వినిపించే ఒకే ఒక్క పేరు ఆర్. నారాయణ మూర్తి. ఇప్పుడు పూరి కూడా అదే స్థాయి లో విప్లవానికి సంబధించిన కథ ను రెడీ చేసి ఆర్. నారాయణ మూర్తి కి వినిపించాడట, కథ విన్న మూర్తి వెంటనే పూరి కి ఓకే చెప్పాడట.

వాస్తవానికి ‘టెంపర్’ చిత్రంలోని పోసాని వేసిన పాత్రను ముందుగా నారాయణ మూర్తి ని సంప్రదించగా, ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారు. దాంతో మనసు మార్చుకున్న పూరి, ఇప్పుడు పూర్తి స్థాయి విప్లవ కథ తో నారాయణ మూర్తి ని పెట్టి సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్, చార్మీతో ‘జ్యోతిలక్ష్మి’ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా పూర్తవ్వగానే ఆర్. నారాయణ మూర్తి చిత్రం సెట్స్ ఫైకి రానుందని సమాచారం.

Exit mobile version