Site icon TeluguMirchi.com

కరీంనగర్‌ లో ఇస్మార్ట్ సందడి..

డాషింగ్ డైరెక్టర్ పూరి ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. రామ్ , నిధి అగర్వాల్ , నాభ నటేష్ లు జంటగా నటించిన ఈ మూవీ జులై 18 న ప్రేక్షకుల ముందుకు వచ్చి మాస్ హిట్ కొట్టింది. ముఖ్యం గా బి, సి సెంటర్లలో ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తుంది. ఇప్పటికే బయ్యర్లు లాభాల బాట పట్టడం తో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ మొదలు పెట్టి సినిమా ప్రదర్శమవుతున్న థియేటర్స్ లలో సందడి చేస్తున్నారు. మంగళవారం కరీంనగర్‌ మమత థియేటర్‌లో చిత్ర యూనిట్ సందడి చేశారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, హీరోయిన్‌ నిధి అగర్వాల్‌తో పాటు ప్రముఖ నటి చార్మి థియేటర్‌ను సందర్శించారు. చిత్రం విజయోత్సవ యాత్రలో భాగంగా వీరు వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి డప్పు చప్పుళ్లతో స్వాగతం పలికారు. థియేటర్ లో పూరి సినిమా డైలాగ్స్ చెప్పి..సినిమా ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. హీరో రామ్ ప్రస్తుతం అమెరికా లో ఉండడం తో ఆయన రాగానే మరోసారి థియేటర్స్ లోకి వస్తామని అభిమానులతో చెప్పుకొచ్చారు.

Exit mobile version