ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ వాయిదా..కారణం అదే..

పూరి – రామ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఇప్పటివరకు విడుదలైన చిత్ర ప్రమోషన్స్ ఆకట్టుకునేలా ఉండడం తో సినిమా ఫై అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆత్రుత కనపరుస్తున్నారు. అయితే ఈ చిత్ర రిలీజ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తుంది.

ముందుగా ఈ చిత్రాన్ని జూలై 12 విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌కటించారు. అయితే వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు జూలై 14తో ముగియ‌నుండ‌గా, ఆ త‌ర్వాత రిలీజ్ చేస్తే సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని భావించిన చిత్ర యూనిట్ సినిమాను జులై 18 కి వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఎక్కడ చూసిన వ‌ర‌ల్డ్ క‌ప్ ఫీవ‌ర్ న‌డుస్తుంది. చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు మ‌ధ్యాహ్నం 3 అయిందంటే టీవీలకి అతుక్కుపోతున్నారు. ఇండియా మ్యాచ్‌ల స‌మ‌యంలో అయితే బ‌య‌ట జ‌న‌సంచారం కూడా త‌గ్గుతుంది. ఇక ఎప్పుడు క‌ళ‌క‌ళ‌లాడే సినిమా థియేట‌ర్స్ కూడా వెల‌వెల‌పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు సినిమాలు వాయిదా వేయగా..ఇప్పుడు ఈ లిస్ట్ లో శంకర్ చేరాడు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాన్ని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో రామ్ స‌ర‌స‌న నిధీ అగర్వాల్, నభా నటేశ్ క‌థానాయిక‌లుగా నటిస్తున్నారు.