దిల్ రాజుకి ఏమీ కలసి రావడం లేదు. ఎవడు సినిమా పూర్తయినా విడుదల చేయలేని పరిస్థితి. ఇప్పుడు రామయ్యా వస్తావయ్యా సినిమా విడుదల విషయంలోనూ ఆయనకు చుక్కెదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఈనెల 10 ‘రామయ్యా వస్తావయ్యా’ విడుదల చేస్తామని.. దిల్ రాజు నిన్నా మొన్నటి వరకూ దీమాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు తన నిర్ణయంపై పునరాలోచించుకొంటున్నారు. ఎందుకంటే తెలంగాణపై కేంద్రం ఓ స్పష్టమైన ప్రకటన చేసింది. కేంద్ర కేబినేట్ తెలంగాణ నిర్ణయానికి మద్దతు తెలిపింది. దాంతో కోస్తాంధ్రలో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 48 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. ఆ తరవాత కూడా పరిస్థితి ఇంతే ఉద్రితంగా ఉండొచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు సినిమాని విడుదల చేయడం తనకు ఇష్టం లేదు. అందుకే.. మరోసారి ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాని వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారమ్.