నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ మీర్ కథానాయికలు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో కొత్త పాటను శుక్రవారం విడుదల చేశారు. మెలోడీగా సాగే ఈ పాట వినసొంపుగా ఉంది.: ‘నా కనులే కనని ఆ కలనే కలిశా.. నీ వలనే బహుశా ఈ వరస.. ఐ వన ఫై.. వన ఫై..’ అంటూ సాగిన పాట బావుంది . హిప్హాప్ తమిళ చక్కటి బాణీలు అందించారు. ఎల్వీ రేవంత్, సంజిత్ హెగ్డే స్వరం పాటకు మరో బలమైంది. ఈ పాట విన్న అభిమానులు బాగుందంటూ యూట్యూబ్లో తెగ కామెంట్స్ చేస్తున్నారు. . ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.