సూపర్స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో ‘2.0’ తో బిజీగా వున్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన ‘కబాలి’ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. రజనీ అల్లుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వరకే ఈ సినిమాకి సంబధించిన ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం దర్శక-నిర్మాతలు చిత్రంలో క్యాస్టింగ్ ఎంపిక పనుల్లో బిజీగా వుంది. ఇందులో బాగంగా రజనీకాంత్కి జోడీగా మొన్నటి వరకు విద్యాబాలన్, దీపిక పదుకొణెపేర్లు వినిపించాయి. అయితే డేట్లు కుదరక వారు ఒప్పుకోలేదని తెలిసింది. అయితే ఇప్పుడు రజనీకి జోడీగా బాలీవుడ్ నటి హుమా ఖురేషీ ఎంపికైనట్లు టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.