అంచనాలు పెరిగిపోయాయి

Yevaduనిన్నామొన్నటి వరకూ ‘ఎవడు’ సినిమా గురించి ఎవరికీ పెద్దగా హోప్స్ లేవు.దాని గురించి అభిమానులు కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేదు. కానీ ‘ఎవడు’ పాటలు, ప్రచార చిత్రం చూశాక – ఒక్క సారిగా మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం నిండిపోయింది. ‘మగధీర’లాంటి సినిమా ఇది అని చిరు, చరణ్, బన్నీ సంయుక్తంగా ఒకే ముక్క మళ్లీ మళ్లీ నొక్కి వక్కానించడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకొన్నారు. ట్రైలర్ కట్ చేసిన విధానం మామూలు కమర్షియల్ సినిమాల తరహాలోనే ఉన్నా. చరణ్ డైలాగ్స్, యాక్షన్ బ్లాక్స్ ఆకట్టుకొన్నాయి. ఇక దేవిశ్రీ తన పాటలతో మరింత ఊపు తెచ్చాడు. ఫాస్ట్ బీట్,మెలోడీ, ఐటెమ్ సాంగ్ అంటూ మెగా ఫ్యాన్స్ కి తన పాటలతో విందు ఇచ్చాడు. మరి ఈజోరు తెరపైనా కనిపిస్తే చరణ్ ఖాతాలో హ్యాట్రిక్ జమైపోయినట్టే. చిరు అభిమానులూ దాని కోసమే ఎదురుచూస్తున్నారు.