Site icon TeluguMirchi.com

రామ్‌ మళ్లీ మాస్‌ కావాలంటున్నాడు

చాలా కాలం తర్వాత ఇస్మార్ట్‌ హిట్‌ కొట్టిన రామ్‌ ప్రస్తుతం తన తదుపరి చిత్రం చర్చల్లో బిజీగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇస్మార్ట్‌ శంకర్‌ సమయంలోనే కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో సినిమా చేసేందుకు డేట్లు ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో గతంలోనే నేను శైలజ చిత్రం వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే తప్పకుండా మరోసారి వీరి కాంబోలో మూవీ వచ్చి హిట్‌ అవుతుందనే నమ్మకంతో అంతా ఎదురు చూస్తున్నారు. ఇంకా మొదలు కాని ఈ చిత్రం గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో రకరకాల చర్చలు పుకార్లు వస్తున్నాయి.

ఇస్మార్ట్‌ శంకర్‌ విడుదలకు ముందే దర్శకుడు కిషోర్‌ ఒక కథను రామ్‌ కోసం సిద్దం చేశాడు. స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్న సమయంలో ఇస్మార్ట్‌ శంకర్‌ రావడం రామ్‌కు సక్సెస్‌ పడటం జరిగింది. దాంతో కిషోర్‌ తిరుమల కథను కాస్త మార్చి స్క్రిప్ట్‌ మొత్తం మాస్‌ మసాలా అంశాలతో రెడీ చేయాలంటూ సూచిస్తున్నాడట. దాంతో కిషోర్‌ తిరుమల ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించాల్సి ఉన్నా కూడా రామ్‌ సూచనలతో క్యాన్సిల్‌ అయ్యింది. కాస్త ఆలస్యంగా వీరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది. అయితే కిషోర్‌ తిరుమల ఇప్పటి వరకు మాస్‌ మసాలా చేయలేదు. కాని ఈసారి ఆయనతో బలవంతంగా అది చేయిస్తే పరిస్థితి ఏంటా అంటూ ఆసక్తికరంగా ఉంది.

Exit mobile version