పారితోషకం కోసం డబ్బింగ్ ఆపిన హీరో రామ్..

ram-3crరామ్ , రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వం లో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం ‘పండగ చేస్కో’. 2014 మే నెలలోనే లాంఛనంగా ఈ చిత్రం ప్రారంభం అయ్యింది. చిత్ర మొదటి నుండి కూడా కష్టాలే వెంటాడుతూ వస్తున్నాయి. అనుకున్న టైం కి మొదటి షెడ్యూల్ స్టార్ట్ కాకపోవడం తో నటీనటుల కాల్షీట్లను అడ్జెస్ట్‌ చేసి, చిత్రీకరణ పూర్తిచేసేసరికి నిర్మాత తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యింది.

ఎలాగలో సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని నిర్మాత అనుకునే లోపే ..హీరో రామ్‌ కారణంగా ఆయనకు కొత్త కష్టాలు ఎదురైనట్లు టాక్. రామ్ నటించిన ముందు మూడు చిత్రాలు ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’ వరుసగా ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాపయినా, ‘పండగ చేస్కో’లో నటించడానికి రామ్‌ రూ. 3 కోట్లు డిమాండ్‌ చేశాడంట. దానికి సరేనన్న నిర్మాత ఇప్పటికే రూ. 2.5 కోట్లను చెల్లించేశాడంట. మిగతా రూ. 50 లక్షలను సినిమా విడుదల సమయంలో ఇస్తానని నిర్మాత ఎంతగా చెప్పిన, రామ్‌ వినడం లేదంట. పారితోషికంలో మిగిలిన డబ్బిస్తేనే డబ్బింగ్‌ చెబుతానంటూ గట్టిగా కూర్చున్నట్లు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రామ్ సర్దుమనిగి డబ్బింగ్ చెపుతాడా లేక 50 లక్షల కోసం పరవు తీసుకుంటాడా అనేది చూడాలి…