Site icon TeluguMirchi.com

పద్మ శ్రీ అవార్డులను వెనక్కిచ్చేయండి !

padmaటాలీవుడ్ సినీనటులు హీరో మోహన్ బాబు, హాస్య నటుడు బ్రహ్మానందం తమ పద్మ శ్రీ అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని హైకోర్ట్ సూచించింది. వీరు పద్మ శ్రీ అవార్డు గ్రహీతలు పాటించాల్సిన మార్గదర్శకాలకు విరుద్దంగా వ్యవహరించారని ఆక్షేపించింది. దేనికైనా రెడీ చిత్ర వివాదం పై దాఖలైన పిర్యాదు పై న్యాయస్థానం పై విదంగా స్పందించింది. దేనికైనా రెడీ చిత్ర వివాదం విషయంలో ‘పద్మ శ్రీ’ గ్రహీతలు గా వుండి వీళ్ళు వ్యవహరించిన తీరును తప్పు పట్టింది. ఇంతకు ముందే సుప్రీంకోర్టు స్పష్టంగా మార్గదర్శకాలిచ్చినా పట్టించుకోకపోవడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రహ్మానందం, మోహన్ బాబులకు నోటీసులు జారీ చేస్తూ.. ‘పద్మశ్రీ’ బిరుదులను మరో వారం రోజుల్లో వెనక్కి ఇచ్చేస్తే గౌరవంగా ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. లేని యడల క్రిమినల్ కేసులు నమోదయ్య ఆవకాశం వుందని నోటిసులు లో పేర్కొంది.

Exit mobile version