వినయం, విధేయంగా మారిన దర్శకుడు

దర్శకుడు హరీష్‌ శంకర్‌ మెగాహీరో వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘వాల్మీకి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు హరీష్‌ మాట్లాడుతూ ఇప్పుడిప్పుడే వినయం, విధేయం నేర్చుకుంటున్నా అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న దిల్‌రాజు మా హరీష్‌ వినయంగా, విధేయంగా ఉండడం నేర్చుకోవడం చాలా మంచి విషయం అని చెప్పుకొచ్చాడు.

తమిళంలో బాగా సక్సెస్‌ అయిన ‘జిగర్తాండ’ చిత్రాన్ని దర్శకుడు తనదైన స్టయిల్‌లో చిత్రీకరించాడు. ఈ చిత్రానికి హరీష్‌ మొదటి నుండే మంచి బజ్‌ క్రియేట్‌ చేశాడు. వరుణ్‌ లుక్‌ను కూడా మార్చేశాడు. ఒక్క టైటిల్‌ విషయం మినహా అంతా పాజిటవ్‌ టాక్‌ ఉంది. అయితే బొమ్మ పడిన తర్వాత ఎలాంటి టాక్‌ వస్తుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. ఈ చిత్రంలో వరుణ్‌ సరసన పూజా హెగ్డే నటించింది.