మిరపకాయ్’, ‘గబ్బర్సింగ్’వంటి సూపర్హిట్ చిత్రాల్ని ఇచ్చిన ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్శంకర్ దర్శకత్వంలో ‘సింహా’ నిర్మాత పరుచూరి ప్రసాద్ ఓ భారీ చిత్రాన్ని నిర్మి స్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు హరీష్శంకర్ మాట్లాడుతూ ..` ‘‘మిరపకాయ్’ చిత్రం జరుగుతున్నప్పట్నుంచి పరుచూరి ప్రసాద్గారు నా దర్శకత్వంలో ఓ మంచి సినిమా తీయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను డైరెక్ట్ చేసే కొత్త సినిమా పరు చూరి ప్రసాద్ గారి బ్యానర్లో చేస్తున్నాను. మెగా కాంపౌండ్లో ఓ యువ హీరోతో నిర్మించే ఈ చిత్రం మంచి ఎంటర్టైనర్గా రూపొందుతుంది. అన్ని కమర్షియల్ ఎలి మెంట్స్ మిక్స్ అయిన సూపర్ సబ్జెక్ట్ ఈచిత్రం కోసం రెడీ అయింది. అతి త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను’’ అన్నారు.