‘సైరా’పై దర్శకుడి షాకింగ్‌ కామెంట్‌

‘డీజే’ చిత్రంతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు హరీష్‌ శంకర్‌ తాజా చిత్రం ‘వాల్మీకి’. ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, పూజాహెగ్డేలు జంటగా నటించారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న హరీష్‌శంకర్‌ తాజాగా మెగాస్టార్‌ నటించిన ‘సైరా’ గురించి మాట్లాడాడు. ‘వాల్మీకి, ‘సైరా’ లలో ఏది ముందు చూస్తారు అని దర్శకుడిని అడగగా హరీష్‌ శంకర్‌ చిరు చిత్రంపై షాకింగ్‌ కామెంట్‌ చేశారు.

నేను డైరెక్ట్‌ చేసిన ‘వాల్మీకి’, ‘సైరా’ రెండు సినిమాలు ఒకేరోజు విడుదలయితే నేను కచ్చితంగా ‘సైరా’నే చూస్తాను. అది మెగాస్టార్‌ సినిమా మరియు క్రేజీ ప్రాజెక్ట్‌. నిజానికి ట్రైలర్‌ చూసినప్పటి నుండి నాకు ‘సైరా’ ఎప్పుడెప్పుడు చూడాలని ఆసక్తిగా ఉందన్నాడు. ఏ దర్శకులైనా తమ చిత్రాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కానీ హరీష్‌ శంకర్‌ తన సినిమా కంటే ‘సైరా’కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం షాకింగ్‌. ‘వాల్మీకి’ సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ గద్దలకొండ గణేష్‌గా కనిపించనున్నాడు.