మెగా రోజు రావాలని కోరుకుంటున్నా!

తనదైన స్టయిల్‌లో రీమేక్‌లను కూడా బ్లాక్‌ బస్టర్‌ చేసే దర్శకుడు హరీష్‌ శంకర్‌  తెరకెక్కించిన ‘వాల్మీకి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో వరుణ్‌, పూజా హెగ్డేలు జంటగా నటించారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’ రీమేక్‌గా పలు మార్పులు చేర్పులతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబయింది. ఈ చిత్రం సెప్టెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న దర్శకుడు హరీష్‌ శంకర్‌ని ఓ ఇంటర్య్వూలో భాగంగా పవన్‌, వరుణ్‌, సాయిధరమ్‌లతో అయిపోయింది కదా ఇక చిరు, చరణ్‌లతో కూడా ప్లాన్‌ చేస్తారా? అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలకు సమాధానంగా అది అనుకుంటే సరిపోదు. దానికి టైం రావాలి. ఆ మెగా రోజు కోసం ఎదురు చూస్తున్నాను. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌, చరణ్‌లకు ఒకే అనే రోజు రావాలి. టైం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. వారు ఓకే అంటే అందరికి సూట్‌ అయ్యే మంచి స్టోరీ ఉంది అంటూ తన మనస్సులోని మాటను బయట పెట్టేశాడు. ఈ సినిమా కలెక్షన్లు ప్రేక్షకుల చేతిలో ఉంటాయి కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నేను హీరో ఒక మంచి సినిమా చేశాం అనే ఫీలింగ్‌ మాత్రం కచ్చితంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.