హరీష్ – 14 రీల్స్ గొడవలు ..?

డీజే చిత్రం తర్వాత చాల గ్యాప్ తర్వాత హరీష్ శంకర్ వాల్మీకి అనే చిత్రం చేస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్ ఫిలిం జిగర్తాండ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా..14 రీల్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ – పూజా హగ్దే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరో నెల రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న తరుణంలో హరీష్ కు చిత్ర నిర్మాతలకు మధ్య గొడవ వచ్చిందనే వార్త ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.

ఈ సినిమాను ప్రాఫిట్ షేరింగ్ మీద, రెమ్యూనిరేషన్ లేకుండా చేస్తున్నారు దర్శకుడు హరీష్ శంకర్. కాగా బిజినెస్ లెక్కల విషయంలో హరీష్ – నిర్మాతల మధ్య ఏదో జరిగిందట..అది చిన్న చిన్నగా పెద్దగా అవడం తో మార్కెటింగ్ లో అనుభవం వున్న శిరీష్ ను పిలిపించి, సర్దుబాటు చేసుకున్నారని అంటున్నారు. ఓ రేంజ్ రేట్లు ఫిక్స్ చేసి, ఆ రేంజ్ లోనే అమ్మి, లాభాలు షేర్ చేసుకునేలా సర్దుబాటు చేసినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్త నిజామా కదా అనేది పక్కాగా తెలియాల్సి ఉంది.