‘గుండెజారి గల్లంతయ్యిందే’ 19న వస్తుంది

nithinనితిన్‌, నిత్య మీనన్‌ జంటగా విక్రమ్‌ గౌడ్‌ సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘గుండెజారి గల్లంతయ్యిందే’. విజయకుమార్‌ కొండా దర్శకుడు. ఇషా తల్వార్‌ మరో నాయికగా నటిస్తోంది. జ్వాల
గుత్తా ఓ స్పెషల్ సాంగ్ లో మెరుస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 19న విడుదలకు సిద్దం అవుతోంది.ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర నిర్మాత నిఖితారెడ్డి మాట్లాడుతూ… ‘గుండెజారి గల్లంతయ్యిందే సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్‌ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే విడుదలైన పాటలకు అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఆడియో విజయాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న వరంగల్ లోని ఏషియన్ శ్రీదేవి మాల్‌లో ప్లాటినం డిస్క్ వేడుకలను
జరుపనున్నామని తెలిపారు.