నాగచైతన్య మనసంతా ‘గుండమ్మ కథ’ చుట్టూనే తిరుగుతోంది. ఈ సినిమాని రీమేక్ చేయాలని చైతూ ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడు. కానీ సమస్య… గుండమ్మ దగ్గరే ఆగిపోయింది. రామారావు, నాగేశ్వరరావు పాత్రలకు వారి వారసులు ఉన్నారు. మరి సూరేకాంతంను వెదికి పట్టుకురావాలి. అందుకే ఆ సినిమా ఆలోచనల దగ్గరే ఆగిపోతోంది. ఈ ప్రాజెక్టుని టేకప్ చేసే దర్శకుడూ లేడాయె. ఇద్దరు హీరోలు జత కట్టడానికి రెడీగా ఉన్నారు. కథ కూడా సిద్ధం. దర్శకుడు లేకపోవడం వల్ల సినిమా ఆగిపోవడం ఎంత విచిత్రం?? కానీ చైతూ మాత్రం ఈ సినిమా చేయాల్సిందే అనే పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. ఆయన కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.