చందు (నాగార్జున) అమెరికాలో ఈవెంట్ మేనేన్ మెంట్ కంపెనీని నిర్వహిస్తుంటాడు. ప్రేమపై పెద్దగా నమ్మకాల్లేవు. ప్రేమ శాశ్వతం అనే మాట ఒప్పుకోడు. బంధాలను ఈజీగా తెంచేసుకొంటాడు. అతను తొలిసారి ఇండియా వస్తాడు. ఇక్కడ సంధ్య (నయనతార) పరిచయం అవుతుంది. ఆమె ‘ఎ మేక్ ఏ విష్’ అనే స్వచ్ఛంత సంస్థలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమెకు ప్రేమపై, బంధాలపై నమ్మకం ఎక్కువ. జీవితంలో శాశ్వతమైనది ప్రేమే అని నమ్ముతుంది. వీరిద్దరి మధ్య నడిచే కథే… ఈ గ్రీకువీరుడు. ఇందులో బ్రహ్మానందం కూడా ఓ డాక్టర్ గానే కనిపిస్తారు. బంధాలను తెంచుకోకూడదు.. వాటిపై నమ్మకం పెంచుకోవాలి అనే కథాంశంతో తీసిన సినిమా ఇది. మీరాచోప్రా పాత్ర కాస్త బబ్లీగా తీర్చిదిద్దారని సమాచారం.