Site icon TeluguMirchi.com

గ్రీకువీరుడు ఆడియో వాయిదా

GREEKUVEERUDUదశరధ్ దర్శకత్వం లో నాగార్జున, నయనతార జంటగా నటించిన కలర్ ఫుల్ రొమాంటిక్ చిత్రం ‘గ్రీకువీరుడు’. తమన్ మ్యూజిక్ అందించిన ఈచిత్రం ఆడియో ను మార్చి 23న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. తాజా వార్తలు ప్రకారం ఈ చిత్రం ఆడియో వేడుక వాయిదా పడినట్లు వినిపిస్తుంది. మార్చి 23న జరగాల్సిన ఆడియో వేడుకను మార్చి 30కి మార్చినట్లు వినికిడి. మొదట ఈ ఆడియో వేడుకను వైజాగ్  లో నిర్వహించా లనుకున్నారు. అయితే తేది తో పాటు వేదిక కుడా మారింది. 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆడియో వేడుకను ఘనంగా జరపాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Exit mobile version