గ్రీకువీరుడు ఆడియో వాయిదా

GREEKUVEERUDUదశరధ్ దర్శకత్వం లో నాగార్జున, నయనతార జంటగా నటించిన కలర్ ఫుల్ రొమాంటిక్ చిత్రం ‘గ్రీకువీరుడు’. తమన్ మ్యూజిక్ అందించిన ఈచిత్రం ఆడియో ను మార్చి 23న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. తాజా వార్తలు ప్రకారం ఈ చిత్రం ఆడియో వేడుక వాయిదా పడినట్లు వినిపిస్తుంది. మార్చి 23న జరగాల్సిన ఆడియో వేడుకను మార్చి 30కి మార్చినట్లు వినికిడి. మొదట ఈ ఆడియో వేడుకను వైజాగ్  లో నిర్వహించా లనుకున్నారు. అయితే తేది తో పాటు వేదిక కుడా మారింది. 30న హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఆడియో వేడుకను ఘనంగా జరపాలని నిర్మాతలు నిర్ణయించుకున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.