రామ్చరణ్ జోరు చూపిస్తున్నాడు. ఏకథాటిగా… గోవిందుడు అందరివాడేలే షూటింగ్లో పాల్గొంటున్నాడు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తచేసుకొంది. ఈనెల 21 నుంచి రాజధానిలో 40 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఆ తరవాత ఫారెన్ లో పాటల్ని చిత్రీకరిస్తారు. దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తయిపోయినట్టే. ఆగస్టులో గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్నట్టు తమన్ ని తీసేసి… యువన్ శంకర్ రాజాని సంగీత దర్శకుడిగా పెట్టుకొన్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ”మా చినబాస్ సినిమాని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాం. టైటిల్ కి వచ్చిన స్పందన బాగుంది. ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. షూటింగ్ ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తప్పకుండా చరణ్ కెరీర్ లో ఇదో మైలురాయి..” అని నిర్మాత బండ్ల గణేష్ చెబుతున్నారు. శ్రీకాంత్, రాజ్ కిరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయిక.