ఇక ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, జయసుధ పాత్రలు మనసుకి అత్తుకు పోయే విధంగా దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు ఇటీవలయ్యాయి. మంచి రెస్పాన్స్ వస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 22న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు మాస్ చిత్రాలతో మాస్ ఆడియెన్స్ కి దగ్గరైన చరణ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరవుతాడని మెగా ఫ్యామిలీ ధీమాగా ఉంది.