రేపే ‘గోవిందుడు అందరివాడేలే’ సెన్సార్

GAV-Censorమెగా పవర్ స్టార్ రామ్ చరణ్,కాజల్,శ్రీకాంత్, కమలిని ముఖర్జీ జంటలుగా నటించిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ చిత్రం అన్ని కార్య క్రమాలు పూర్తీ చేసుకొని రేపు సెన్సార్ జరుపుకోబోతుంది..సినిమా యూనిట్ తో పాటు మెగా అబిమానులు కూడా ఖచ్చితంగా సెన్సార్ నుండి ‘యు’ సర్టిఫికేట్ వస్తుంది అని భావిస్తున్నారు..అలాగే మహేష్ కు ఓ మురారి లా , నాగ్ కు నిన్నే పెళ్ళాడతా లాంటి గొప్ప సినిమాలగా రామ్ చరణ్ కు గోవిందుడు అందరివాడేలే మిగిలిపోతుంది అని అంచనా వేస్తున్నారు.

ఇక ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్, జయసుధ పాత్రలు మనసుకి అత్తుకు పోయే విధంగా దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమాలోని పాటలు ఇటీవలయ్యాయి. మంచి రెస్పాన్స్ వస్తుంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా ఈనెల 22న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని వార్తలు వినపడుతున్నాయి. ఇప్పటి వరకు మాస్ చిత్రాలతో మాస్ ఆడియెన్స్ కి దగ్గరైన చరణ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరవుతాడని మెగా ఫ్యామిలీ ధీమాగా ఉంది.